ఎంపి శ్రీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి సంతాపం Published by:Admin, Date:16-09-2020:10:02 |
|
తిరుపతి పార్లమెంటు సభ్యుడు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ బాధ్యులు(రీజనల్ ఇన్చార్జ్), టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ దుర్గాప్రసాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉండేవారని చెప్పారు. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీ దుర్గాప్రసాద్ నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పట్ల వెనువెంటనే స్పందించేవారని నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. |
![]() ![]() |
WRITE COMMENT
తాజా వార్తలు తాజా వార్తలు
|
స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 లక్షలు విరాళం |
|
సెప్టెంబరు 29 నుండి తిరుమలలో '' షోడశదిన సుందరకాండ దీక్ష '' |
|
బాలు మృతి పై టీటీడీ ఛైర్మన్ సంతాపం |
|
తిరుమలలో కర్ణాటక సత్రాల వసతి సముదాయాల నిర్మాణానికి భూమిపూజ |
|
ఈనెల 23, 24 ముఖ్యమంత్రితిరుపతిపర్యటన |
సినిమా వార్తలు
|
బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం |
|
అల్లు అర్జున్పై పోలీస్ కంప్లైంట్ |
|
.విభిన్న పాత్రలతో మెప్పించిన జయప్రకాష్ రెడ్డి |
|
సుశాంత్ కేసులో కీలక మలుపు.. రియా అరెస్ట్ |
|
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ బులిటెన్ |